హుజురాబాద్/ డిసెంబర్ 19 (మా అక్షరం): అయ్యప్ప మాల ధారణలో భాగంగా హుజురాబాద్ లోని మార్కెట్ సమీపంలో జమాల్ పూర్ అనిల్ ఆధ్వర్యంలో గురువారం అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. అయ్యప్పలు పెద్ద ఎత్తున హాజరై భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా గురు స్వాములు అయ్యప్ప 18 మెట్లకు గల విశిష్టతను భక్తులకు తెలిపారు. అయ్యప్ప మాలధారణలోని అర్ధాన్ని వివరించారు.. అనంతరం అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు సహపంక్తి భీక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో స్వాములు భక్తులు పాల్గొన్నారు.
Post Views: 47











