+91 99635 77856

మహిళా బిల్లులో బీసీ కోటపై స్పష్టతనివ్వాలి.

– బీసీ ఆజాద్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్…
-బీసీ ఆజాది మహిళ సమైక్య మండల అధ్యక్షురాలుగా మండల సరిత..

హుజురాబాద్/జనవరి11(మా అక్షరం): మండలంలోని శాలపల్లి గ్రామానికి చెందిన మండల సరితను బిసి ఆజాది మహిళ సమైక్య మండల అధ్యక్షురాలుగా నియమిస్తూ బీసీ ఆజాది ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ లు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం హుజురాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో జరిగిన బీసీ మహిళ సమావేశంలో వారిని ఏకగ్రీవంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.ఈ సందర్భంగా జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ…
బీసీ మహిళల ఐక్యతతో రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని, గ్రామ గ్రామాన బీసీల ఐక్యతతో పోరాటాన్ని కొనసాగించాలని కోరారు సావిత్రిబాయి పూలే, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల స్ఫూర్తితో జాతీయ మహిళా బిల్లులో బీసీల వాటా కోసం పోరాటాన్ని చేస్తామని అన్నారు.అనంతరం నియమించబడిన నాయకురాలు మండల సరిత మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ నియామకం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేశారు, బీసీల ఉద్యమ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు తన నియమకానికి కృషిచేసిన జిల్లా కన్వీనర్ చిలక మారి శ్రీనివాస్, నాయకురాలు బింగి రాణి బీసీ ఆజాది మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు చిందం సునీత జిల్లా అధ్యక్షురాలు తేజశ్రీ లకు కృతజ్ఞతలు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !