– బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్…
– హుజురాబాద్ లో బీసీల సైకిల్ యాత్ర ….
హుజురాబాద్/ జనవరి 22 (మా అక్షరం): బీసీల ఐక్యతతో హక్కుల సాధన కోసం పోరాడుతామని, నిర్విరామ పోరాటంతో రాజ్యాధికారాన్ని సాధిస్తామని బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్ అన్నారు.
ఖిలాశాపూర్ నుంచి మొదలైన బీసీల సైకిల్ యాత్ర బుధవారం హుజురాబాద్ కు చేరింది, చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో బీసీ ఆజాది ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ లు హాజరై మాట్లాడారు.జనాభాలో దాదాపు సగా భాగమైన బీసీలం అన్ని రంగాలలో వెనకబడి ఉన్నామని పన్నులు కట్టి దేశాన్ని నడిపే బీసీలం అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నామని యాచించే స్థాయి నుంచి పాలించే స్థాయికి రావాలని ఆ పాలన కోసం బీసీలకుచట్టసభల్లో కూచోబెట్టి ఈ దేశాన్ని పాలించినపుడే దేశ స్థితి గతులు మారతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సైకిల్ యాత్ర సాధకులు బత్తుల సిద్ధేశ్వర్, చాపర్తి కుమార్ గాడ్గే, కొంగర నరహరి మాల, పర్వత సతీష్ ,విజయ్ కుమార్ మాదిగ, మోహన్ రెడ్డి,చంద్రయ్య మాదిగ,మూర్తి, వెంకటేష్,సుధాకర్,జహంగీర్,జయ్ తదితరులు పాల్గొన్నారు.











