– పథకాల లిస్ట్ లపై అభ్యంతరాలు…
హుజురాబాద్/ జనవరి 22 (మా అక్షరం): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు ,రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకాలు నాలుగు సంక్షేమ పథకాల కోసం ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులకు ప్రజల నుండి ప్రశ్నలు, నిలదీతలు ఎదురవుతూనే ఉన్నాయి.
బుధవారం హుజురాబాద్ మండలంలో రాంపూర్ గ్రామంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా గ్రామసభ, నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సభల్లో అధికారులకు ప్రజల నుండి సంక్షేమ పథకాల లిస్ట్ లపై , గ్రామంలో ప్రజల నుండి అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీశారు.
Post Views: 226











