తిమ్మాపూర్/జనవరి28(మా అక్షరం):
మండలంలోని మల్లాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సోమవారం కాంగ్రెస్ నాయకుడు చెన్నాడి శ్రీధర్ రెడ్డి బహుమతులు అందించి విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…. క్రీడలు విద్యార్థుల్లో ఉల్లాసాన్ని,మానోదైర్యాన్ని నింపడమే కాకుండా విద్యార్థుల్లో ఐక్యతా భావాన్ని పెంపోందిస్తాయని,కాబట్టి విద్యార్థులు చిన్న వయసు నుండే చదువుతో పాటు ఆసక్తిగల క్రీడల్లో రాణిస్తూ ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 64











