– కాళేశ్వరం మీ అవినీతికి నిదర్శనం..
– కేకే మహేందర్ రెడ్డి…
సిరిసిల్ల / ఫిబ్రవరి 01(మా అక్షరం):పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ… నేను కొడితే మాములుగుండదని అంటున్న కెసిఆర్, నువ్వు ఫామ్ హౌస్ లో మందు కొట్టుకుంటూనే ఉంటున్నది ప్రజలందరికి తెలుసన్నారు. సంతకం పెట్టక పోతే తన నౌకరి పోతుందని, అసెంబ్లీ కి వచ్చాడని ఏద్దేవా చేశారు.16 వేల మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని అన్నారు.కాళేశ్వరం మీ అవినీతికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు పాలించిన, ఒక్క పార్టీ భవనాన్ని నిర్మించలేదని అన్నారు. అన్ని అద్దె భావనాలేనని, మీ పార్టీ ఫండ్ 1160 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నంచారు. నీ ఉనికి కాపాడుకోవడం కోసం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవద్దని అన్నారు.ఈ కార్యకమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చక్రధర్ రెడ్డి,గడ్డం నర్సయ్య, సూర దేవరాజ్,ఆకునూరి బాలరాజు, మహిళా నాయకురాళ్లు కల్లూరి చందన, శరణ్య తదితరులు పాల్గొన్నారు.











