+91 99635 77856

శేఖర్ రావు నామినేషన్ ర్యాలీకి తరలి వెళ్లిన ట్రస్మా నాయకులు

హుజురాబాద్/ఫిబ్రవరి10 (మా అక్షరం):కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టబద్రుల ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న, ట్రస్మా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు జిల్లా కేంద్రంలో నిర్వహించిన నామినేషన్ ర్యాలీకి హుజురాబాద్ మండల ప్రైవేట్ పాఠశాలల యజమానులు హుజురాబాద్ నుండి సోమవారం తరలి వెళ్లారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ట్రస్మా పాఠశాలల మద్దతు యాదగిరి శేఖర్ రావు మాత్రమే ఉంటుందని తమకు మేలు చేసిన యాదగిరి రావు ను తామే దగ్గరుండి గెలిపించుకుంటామని వారన్నారు.ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర నాయకులు సుంకిశాల సంతోష్ రావు, నియోజకవర్గ కన్వీనర్ బద్దుల రాజ్ కుమార్, హనుమకొండ జిల్లా నాయకులు దేవేందర్రావు,హుజురాబాద్ అధ్యక్షులు వకులాభరణం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పారెడ్డి రవీందర్ రెడ్డి కోశాధికారి దాసరి కోటేశ్వర్ యాదవ్, జిల్లా నాయకులు మాడిశెట్టి ప్రసాద్, విన్సెంట్ జార్జ్, ఏనుగు మహిపాల్ రెడ్డి, గోపాల్, వెంగల్ రావు, విజయ్ పాల్ రెడ్డి, తిరుపతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !