-నిర్లక్ష్యంగా వైన్స్ నిర్వాహకుని సమాధానం..
హుజురాబాద్/ఫిబ్రవరి10(మా అక్షరం): పట్టణంలో శ్రీ మందాకిని దుర్గా వైన్స్ లో ఓ విక్రయదారుడు మద్యాన్ని కొనుగోలు చేయగా ఆ మద్యం లీకేజ్ తో పాటు అందులో చెత్తా చెదారం కనబడింది.ఇదేమిటని సదరు వినియోగదారుడు షాపు నిర్వాహకుని అడుగుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. వరంగల్ రోడ్ లోని శ్రీ మందాకిని దుర్గా వైన్స్ లో ఓ యువకుడు మద్యాన్ని కొనుగోలు చేయగా అందులో చెత్తా చెదారం ఉండడం లీక్ కావడం గమనించి షాపు యజమానిని ప్రశ్నించగా నాకు ఎలాంటి సంబంధం లేదని ఎవరితో చెప్పుకున్న పర్వాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. వినియోగదారుడు వీడియో తీస్తుంటే అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎక్సైజ్ అధికారులు స్పందించి మద్యం వినియోగదారుల కు నాణ్యమైన మద్యాన్ని అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
Post Views: 344











