-దంపతుల ఇరువురి పై కత్తులతో దాడి..
-80 తులాల బంగారం 7 లక్షల నగదు అపహరణ..
-సందర్శించి విచారించిన టౌన్ సిఐ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం ..
హుజురాబాద్/ ఫిబ్రవరి 24 (మా అక్షరం): పట్టణంలోని ప్రతాప వాడకు చెందిన ప్రతాప రాఘవరెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి11.30 గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి చోరీ చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… రాత్రి దొంగలు నీటి మోటర్ ఆన్ చేసి మాటు వేసి ఉన్నారని దాన్ని గ్రహించని కుటుంబ సభ్యులు మోటారు ఓవర్ ఫ్లో అయి నీరు వృధాగా పోవడం గమనించి మోటర్ ఆఫ్ చేద్దామని బయటికి వెళ్లారు. ఒక్కసారిగా దొంగలు దాడి చేసి చోరీకి పాల్పడ్డారని కత్తులతో దాడి చేశారని ఇంట్లో ఉన్న 80 తులాల బంగారం ఏడు లక్షల నగదు దొంగలించారని తెలిపారు. విషయం తెలుసుకుని వచ్చిన రాఘవరెడ్డి కుటుంబ సభ్యులు వచ్చి గాయపడ్డ ఇరువురిని చికిత్స నిమిత్తం గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిఐ తిరుమల్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందం నీ రంగంలోకి దింపారు.కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.











