హుజురాబాద్/ మార్చి 17 (మా అక్షరం): హుజురాబాద్ మునిసిపాలిటీ 22వ వార్డులో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్వచ్ఛతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు,తడి చెత్త – పొడి చెత్త వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలపై వివరించడంతో పాటు ప్రజలకు క్లీన్ అండ్ గ్రీన్ హుజురాబాద్ లక్ష్యంగా నడవాలని సూచించారు.పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజల భాగస్వామ్యంతోనే హుజురాబాద్ను పరిశుభ్రంగా ఉంచగలం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ 22వ వార్డు తాజా మాజీ వార్డు కౌన్సిలర్ పైళ్ళ వెంకట్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ యం. కిషన్ రావు,సానిటరీ జవాన్ రొంటాల సుధీర్, మెప్మా సి ఎల్ ఆర్ పి,ఆర్ పి జె. రమాదేవి,22వ వార్డు ప్రజలు పురపాలక సంఘ పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











