ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్…
ఎల్కతుర్తి /మార్చి 29 (మా అక్షరం)
మండలంలోని వల్భాపూర్ గ్రామంలో శ్రీ పశుపతినాథ్ స్వామి దేవాలయ ఆలయ అర్చకులు సదానిరంజన్ సిద్ధాంతి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా హాజరైన ఎల్కతుర్తి మండల ఎంపీడీవో ఎన్. విజయ్ కుమార్ కు పూర్ణకుంభంతో పూజా కార్యక్రమం నిర్వహించి వేద పండితుల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ధూప దీప నైవేద్య సంఘం పంచాంగాన్ని ఆవిష్కరించారాని సదానిరంజన్ సిద్ధాంతి హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్కతుర్తి మండల అధ్యక్షులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా అధ్యక్షులు సిద్ధాంతి గణేష్, కార్యదర్శి ఆరుట్ల మాధవాచార్యులు, కోశాధికారి మల్లన్న మండల అర్చకులు నందనం రవి, మనీ, శ్యాంసుందర్, రేణుకస్వామి,సంతోష్, శ్రీనివాస్, కోటేశ్వర్, సాంబయ్య, చరణ్, ఆలయ చైర్మన్ భావనఋషి, కోడెం రమేష్ , తదితరులు పాల్గొన్నారు.
Post Views: 154











