హుజురాబాద్/ఏప్రిల్ 08(మా అక్షరం): మండలంలోని పెద్ద పాపయ్య పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న పాకాల సంజన జిల్లా స్థాయిలో మంగళవారం మ్యాథ్స్ ఒలంపియాడులో సిల్వర్ మెడల్, ప్రశంసా పత్రం సాధించడం జరిగింది. ఈ అవార్డును జిల్లాలోని 16 మంది విద్యార్థులు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అందజేశారు. ఈ సందర్బంగా పాకాల సంజనను మండల విద్యాధికారి భూపతి శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధానోపాధ్యాయులు సి.హెచ్ అనురాధ, ఉపాధ్యాయ బృందం, తల్లి దండ్రులు అభినందనలు తెలిపారు.
Post Views: 163











