+91 99635 77856

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

హుజురాబాద్/ ఏప్రిల్ 14(మా అక్షరం): మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని సోమవారం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మంతెన సురేందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ నాయకులు చందుపట్ల జనార్ధన్ హాజరై మాట్లాడుతూ… అట్టడుగు అణగారిన వర్గాల కొరకు తన జీవితాన్ని దారాదత్తం చేసిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని తెలియజేస్తూ అంబేద్కర్ జన్మ దినాన్ని ఐక్యరాజ్యసమితి ప్రపంచ వైజ్ఞానిక దినోత్సవం గా ప్రకటించి అతనిని ప్రపంచ మేధావిగా గుర్తించి అతని పట్ల తమ అభిమానాన్ని చాటుకోవడం భారతీయులుగా మనమందరం గర్వించదగ్గ విషయమన్నారు. కుల వివక్ష అంటరానితనంపై అలుపెరుగని పోరాటం చేస్తూ స్త్రీ సాధి కారిత కొరకు నిరంతరం కృషిచేసిన కృషివలుడు అంబేద్కర్ అని కొనియాడారు. విద్యాభివృద్ధి కొరకు అనేక కళాశాలలు స్థాపించి విద్య పట్ల తన మక్కువను చాటుకున్న మహనీయుడు అంబేద్కర్ భారత ప్రజల గుండెలలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ అజరామరుడుగా నిలుస్తాడని అభిలాషించినారు. కార్యక్రమములో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి దేవునూరి కిరణ్ కుమార్, చొ ల్లేటి మల్లారెడ్డి,పున్నం రాజేందర్,దేవునూరి రవీందర్, నరుకుడు ప్రభాకర్,నందిపేట పరమేశ్వర్,దేవునూరి బాబు పొడిసెట్టి రాజ్ కుమార్, చందుపట్ల రాజేందర్,చెన్నోజు భద్రయ్య,గూళ్ల శ్రీనివాస్, మూల చంద్రశేఖర్ రెడ్డి, మామిడి రమేష,వెన్నంపల్లి శ్రీనివాస్,బండ అజయ్,గాజుల సమ్మయ్య,చొ ల్లేటి రాధా కిషన్, కాలేశ్వరం కార్తీక్, చొ ల్లేటి హరికిషన్,గాజుల అశోక్ ఎలుకపల్లి మనీ కుమార్, శనిగరం కుమార్,చొప్పరి సమ్మయ్య,తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !