+91 99635 77856

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

హుజురాబాద్/ ఏప్రిల్ 14,(అక్షరం న్యూస్): భారత రాజ్యాంగ నిర్మాత డాబిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పట్టణంలో అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

పురపాలక సంఘం కార్యాలయంలో …

పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, జయంతి ఉత్సవాలను పురపాలక సంఘం కమిషనర్ కే. సమ్మయ్య ప్రారంభించారు. అనంతరం తలసేమియాతో బాధపడే చిన్నారుల కోసం పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం నందు కమిషనర్, పురపాలక సంఘ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొని రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ కె. సమ్మయ్య, హుజురాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, పురపాలక సంఘ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి , సీనియర్/ జూనియర్ సహాయకులు, ఇంచార్జి సానిటరీ ఇన్స్పెక్టర్ ఎం. కిషన్ రావు, వార్డు అధికారులు, సానిటరీ జవాన్లు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !