– ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి…
– ఆయన సేవలు గుర్తు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు…
– ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రణవ్…
హుజురాబాద్/మే 21(మా అక్షరం): దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్పనేత రాజీవ్ గాంధీ అని,దేశం కోసం వారి చేసిన సేవలు మరువలేనివని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.బుధవారం రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని బస్ డిపో క్రాస్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… దేశంలో నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చి అందరికీ విద్యను అందించారని,జవహర్ నవోదయ విద్యాలయాలను ప్రారంభించి ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేశారని,ఇప్పటికీ టెక్నాలజీ వ్యవస్థ ముందుకు పోతుంది అంటే అది రాజీవ్ గాంధీ తీసుకున్న కృషి అని అన్నారు.దేశంలోని పరిశ్రమలకు రాయితీలను కల్పించి అనేక సంస్కరణలను తీసుకువచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు పత్తి కృష్ణారెడ్డి,హుజురాబాద్ టౌన్,మండల అధ్యక్షులు తిరుపతి,కిరణ్,హుజురాబాద్ టౌన్,మండల మహిళా అధ్యక్షురాలు పుల్ల రాధ,పుష్పలత,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరి-స్వామి రెడ్డి, డైరెక్టర్లు,హనుమాన్ దేవాలయ చైర్మెన్ శంకర్,డైరెక్టర్లు,మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్,చెల్పూర్ మాజీ సర్పంచ్ మహేందర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొల్లు బాబు,దశరథం,ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవీందర్, సోషల్ మీడియా ఇంచార్జి రాజు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.











