కుక్కల దాడిలో మేకలు మృతి
– ఇప్పల్ నర్సింగాపూర్లో రైతు పుట్టపాక సమ్మయ్యకు భారీ నష్టం..
హుజురాబాద్ /జూన్ 21( మా అక్షరం): హుజురాబాద్ లోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు పుట్టపాక సమ్మయ్యకు చెందిన పాడి మేకలపై శనివారం తన మందపై జరిగిన కుక్కల దాడిలో దాదాపు పది మేకల దాకా మృతి చెందాయని గ్రామస్తులు తెలిపారు.ఇదే ఆయన కుటుంబం జీవనాధారం కావడంతో సమ్మయ్య ఆవేదనకు లోనయ్యారని, ప్రభుత్వం స్పందించి ఆయనకు న్యాయం చేయాలని అలాగే రోజురోజుకు వీధి కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారని, కావున మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే వీధి కుక్కల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 191











