– ఇప్పల్ నర్సింగాపూర్లో రైతు పుట్టపాక సమ్మయ్యకు భారీ నష్టం..
హుజురాబాద్ /జూన్ 21( మా అక్షరం): హుజురాబాద్ లోని ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామానికి చెందిన రైతు పుట్టపాక సమ్మయ్యకు చెందిన పాడి మేకలపై శనివారం జరిగిన కుక్కల దాడిలో పది మేకలు ప్రాణాలు కోల్పోయాయి. ఇదే ఆయన కుటుంబం జీవనాధారం కావడంతో సమ్మయ్య ఆవేదనకు లోనయ్యారు.
రోజురోజుకు వీధి కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. కావున మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే వీధి కుక్కల నుంచి కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post Views: 132











