+91 99635 77856

ఇందిరమ్మ ఇండ్ల పథకానికి భూమి పూజ కార్యక్రమం

-లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు అందజేసిన కాంగ్రెస్ నాయకులు…
హుజూరాబాద్/ జూన్ 30 (మా అక్షరం):
పట్టణం లోని మున్సిపాలిటీ 13వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులుగా ఎంపికైన ఆకునూరి స్వరూప-రాజుకుమార్ దంపతుల ఇంటి నిర్మాణానికి సోమవారం భూమి పూజ జరిగింది.ఈ సందర్భంగా అధికారికంగా ప్రొసీడింగ్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ ప్రధాన కార్యదర్శి చందమల్ల బాబు, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు వేముల పుష్పలత, 13వ వార్డు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోరే తిరుపతి, బత్తిని రవీందర్ గౌడ్, యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్, మొగిలి, వంశీ, మున్సిపాలిటీ వార్డు ఆఫీసర్ రాము తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇండ్ల పథకం పేద ప్రజల ఆకాంక్షల నెరవేర్పుకు, వారికి నివాస హక్కును కల్పించేందుకు మంచి ఉదాహరణ,అని పేర్కొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !