+91 99635 77856

హుజురాబాద్ నుండి ఛలో హైదరాబాద్‌కు భారీగా తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు

హుజరాబాద్/ జూలై 04 (మా అక్షరం):ఐఎన్డీ అలయన్స్ కూటమి ఆధ్వర్యంలో జరుగుతున్న “జై బాపు – జై భీమ్ – జై సంవిధాన్” కార్యక్రమానికి భాగంగా, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు శుక్రవారం ఛలో హైదరాబాద్ కార్యక్రమం ఘనంగా సాగింది.ఈ నేపథ్యంలో హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, హుజురాబాద్ మండలంతో పాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హైదరాబాద్‌కు చేరుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు “జై కాంగ్రెస్… జై జై కాంగ్రెస్” అనే నినాదాలతో కార్యక్రమ ప్రాంగణాన్ని ఉద్వేగభరితంగా మార్చారు.కార్యక్రమంలో పార్టీ విలువలు, రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక సమానత్వం వంటి అంశాలపై నేతలు ఉద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ పునరుద్ధానానికి ఈ కార్యక్రమం ఒక కొత్త దిశగా నిలుస్తుందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !