+91 99635 77856

మాంటిస్సోరిలో ఘనంగా గోరింటాకు పండగ

హుజురాబాద్/ జులై 11(మా అక్షరం):ఆషాడ మాసం పురస్కరించుకొని పట్టణంలోని కాకతీయ కాలనీలో గల మాంటిస్సోరి పాఠశాలలో గోరింటాకు పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని బాలికలు గోరింటాకును వారి చేతులకు అందంగా అలంకరించుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు గీతాషాజు మాట్లాడుతూ… స్త్రీలకు అత్యంత ఇష్టమైన గోరింటాకు పండగ జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు .ఈ గోరింటాకులో ఆరోగ్యానికి కావలసిన ఔషధ లక్షణాలు ఉన్నాయని పిల్లలకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !