+91 99635 77856

పేద కుటుంబాలకు ఉచిత ఆపరేషన్లు చేయడం అభినందనీయం

 

హుజురాబాద్ /జూలై 12 (మాఅక్షరం) :పేదలకు ఉచిత ఆపరేషన్ చేయడం అభినందనీయమని ఆల్ మైటీ పాస్టర్స్ హుజురాబాద్ నియోజకవర్గం పాస్టర్స్ అధ్యక్షుడు పాస్టర్ నాగిశెట్టి దానియేల్ అన్నారు. శనివారం హుజరాబాద్ లోని సూపర్ బజార్ లో గల డాక్టర్ సుజాత హాస్పిటల్ లో ఆల్ మైటీ పాస్టర్స్ హుజురాబాద్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైద్య వృత్తిలో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలకు ఉచిత వైద్యం అందించడంతో చాలామంది నిరుపేదలకు సహాయం అవుతుందని అన్నారు. పేదలంతా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పేదల కోసం వైద్యురాలు సుజాత అందిస్తున్న తీరు హర్షినియమన్నారు. వైద్యురాలు సుజాతను మరి కొంతమంది వైద్యులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి నిర్వాహకుడు గుజ్జుల మధుకర్ రెడ్డి, పాస్టర్లు పాస్టర్ వరికిల్ల ప్రసాద్, హుజురాబాద్ పాస్టర్స్ మండల ప్రెసిడెంట్ పాస్టర్ డి డేవిడ్ రాజు, ఉపాధ్యక్షులు పాస్టర్ చల్లూరి ప్రేమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పాస్టర్ సారంగ పాణి , కోశాధికారి పాస్టర్ కె జోసెఫ, కె ఎల్ డానియల్ పి ఆంధ్రయ ఎం అజయ్ పాస్టర్ ఆసుపత్రి సిబ్బంది దివ్య, కిరణ్, సంతోష్, తిరుపతి, కృష్ణమూర్తి, సదానందం పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !