+91 99635 77856

ఘనంగా టి జి ఎం ఈ యు వజ్రోత్సవాలు

హుజురాబాద్/ జూలై 24 (మా అక్షరం): తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ వజ్రోత్సవాలను సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వాతి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి హాజరై మాట్లాడుతూ… తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఆయన తెలిపారు. మెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం టీజీ ఎం ఈ యు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ గా స్వాతి, వర్కింగ్ ప్రెసిడెంట్లు గా జోష్ణ ప్రియదర్శిని, పద్మ, కార్యదర్శులుగా శోభ, జమునరాణి, సహాయ కార్యదర్శులుగా స్రవంతి, రోజా రాణి, కోశాధికారిగా కనక లక్ష్మి, కార్యవర్గ సభ్యులుగా స్వప్న, సుభాషిని, స్వరూప, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !