హుజురాబాద్/జూలై 24 (మా అక్షరం): కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) 49వ జన్మదినాన్ని పట్టణంలో ఘనంగా నిర్వహించారు. గురువారం పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేసి, ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి కేటీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. పార్టీ కార్యాచరణను గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన చూపిన పట్టుదలను వారు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గందే రాధిక -శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగెం ఐలయ్య, మాజీ కౌన్సిలర్లు అపరాజ ముత్యం రాజు, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ముక్క రమేష్, కల్లెపల్లి రమాదేవి, రోశెందర్, గనిశెట్టి ఉమామహేశ్వర్, కొండ్ర నరేష్, మక్కపల్లి కుమార్, ప్రతాప్ కృష్ణ, ఇమ్రాన్, కొయ్యడ శ్రీదేవి, కమలాకర్, చంద గాంధీ, కేసరి మధుకర్ రావు, బత్తుల సమ్మయ్య, మోరె మధు, దిల్ శ్రీనివాస్, కత్తెరసాల సదానందం, ముశం అశోక్, లింగమూర్తి, మక్కపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.











