+91 99635 77856

విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆర్టిజన్ ఉద్యోగి మృతి

హుజూరాబాద్/ అక్టోబర్ 01 (మా అక్షరం):పట్టణ శివారులోని 132/33 కేవీ సబ్‌స్టేషన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తూనే ఆర్టిజన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రంగాపూర్ గ్రామానికి చెందిన బోడ శంకర్ రెడ్డి (40) బుధవారం కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు.స్థానికుల వివరాల ప్రకారం… బోర్నపల్లి సబ్‌స్టేషన్‌లో పనులు చేస్తుండగా శంకర్ రెడ్డి విద్యుత్ స్తంభంపై ఎక్కిన సమయంలో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి తీవ్రంగా షాక్‌కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నారు.శంకర్ రెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన అకాల మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.సంబంధిత అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !