హుజురాబాద్/ అక్టోబర్ 03 (మా అక్షరం) : పట్టణంలోని జమాతే హైలథిస్ హుజురాబాద్ కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కమిటీ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని, నూతన కార్యవర్గాన్ని ఏకతాటిపై ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీలో మొహమ్మద్ చాంద్ పాషా ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.మొహమ్మద్ అక్బర్ పాషా సెక్రెటరీగా,మొహమ్మద్ రాజ్ మమ్మద్ ట్రెజరీగా ఎన్నికయ్యారు.వైస్ ప్రెసిడెంట్లుగా మొహమ్మద్ జాఫర్, మహమ్మద్ హైమద్,ఎన్నుకున్నారు. అలాగే,జాయింట్ సెక్రెటరీలుగా మహమ్మద్ యూసఫ్, మహమ్మద్ ఇస్మాయిల్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన ప్రెసిడెంట్ మొహమ్మద్ చాంద్ పాషా మాట్లాడుతూ, కమిటీ లక్ష్యాల సాధన కోసం అందరి సహకారంతో కృషి చేస్తామని తెలిపారు.
Post Views: 147











