+91 99635 77856

కాకతీయ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

హుజురాబాద్/అక్టోబర్ 04 (మా అక్షరం):మండలంలోని చిన్న పాపయ్య పల్లె గ్రామ సమీపంలో ఉన్న సువర్ణ ఫంక్షన్ హాల్ లో ( 2013- 14) బ్యాచ్ కాకతీయ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హెడ్మాస్టర్ బద్దుల రాజ్ కుమార్ హాజరై మాట్లాడుతూ… పూర్వ విద్యార్థుల కృషి వల్ల విద్య సంస్థ ప్రతిష్ట పెరుగుతుందని పేర్కొన్నారు. పలువురు పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇచ్చారు. తదనంతరం హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వెంగళరావు రాంబాబు, ఉపాధ్యాయులు పోగుల రాజయ్య, అజ్మత్ అలీ, బండారి రమేష్, శ్రీపతి కిరణ్, తిరుపతి విద్యార్థులు మూదం మానస, పవన్, భరత్, సంతోష్ ,జ్యోత్స్న, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !