హుజురాబాద్/ అక్టోబర్ 09 (మా అక్షరం):కాట్రపల్లి గ్రామానికి చెందిన సిఆర్పిఎఫ్ జవాను పెరమండ్ల రాజ్ కుమార్ (38) ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే … రాజ్ కుమార్ జార్ఖండ్ రాష్ట్రంలో సిఆర్పిఎఫ్ లో ఉద్యోగం చేస్తూ, ఇటీవల దసరా సెలవుల సందర్భంగా స్వగ్రామానికి వచ్చాడు.గత రెండు రోజులుగా మౌనంగా ఉంటూ మానసిక ఆందోళనకు లోనైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం సుమారు ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో, ముందుగానే కొనుగోలు చేసిన నైలాన్ తాడుతో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని జీవితం ముగించుకున్నాడు.సమయానికి ఇంట్లో అతని భార్య, రెండేళ్ల కుమార్తె పుట్టింటికి వెళ్లి ఉండటం గమనార్హం.ఈ ఘటనపై రాజ్ కుమార్ తండ్రి బిక్షపతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 454











