హుజురాబాద్/అక్టోబర్ 08(మా అక్షరం):పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. గత కొంతకాలంగా పట్టణ పరిధిలో భిక్షాటన చేస్తూ వచ్చిన వ్యక్తి మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇందిరా నగర్ సమీపంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా, కొత్తపెళ్లి రోడ్డుకు వెళ్లే మార్గంలో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై మున్సిపల్ శానిటరీ సూపర్వైజర్ తూముల కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హుజురాబాద్ పట్టణ సీఐ టి.కరుణాకర్ తెలిపారు.మృతుడి వివరాలు తెలిసిన వారు హుజురాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు:
పట్టణ సీఐ, హుజురాబాద్: 87126 70773
ఎస్ఐ, హుజురాబాద్: 87125 74726
Post Views: 364











