హుజురాబాద్/ అక్టోబర్ 16 (మా అక్షరం): సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా దేశంలో కాంగ్రెస్ పార్టీ నూతన ఒరవడిని తీసుకొచ్చిందని కర్ణాటక రాష్ట్ర హంగల్ శాసన సభ్యుడు మానే శ్రీనివాస్ అన్నారు.గురువారం పట్టణంలో సాయి రూప ఫంక్షన్ హాల్ లో స్థానిక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మానకొండూర్ శాసనసభ్యుడు కవ్వంపల్లి సత్యనారాయణ,టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ,టీపీసీసి పరిశీలకులు మ్యాడం బాలకృష్ణ హాజరై మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతాని కంటే బిన్నంగా ఈ సారి జిల్లా అధ్యక్షుల ఎంపికను వార్డు,గ్రామం,మండల,నియోజక వర్గ స్థాయి నాయకుల అభిప్రాయాలు తీసుకొని జిల్లా అధ్యక్షున్నీ ఎన్నుకోవడం జరుగుతుందని,దేశంలోనీ ఐదు రాష్ట్రాల్లో పూర్తి చేసుకొని దక్షిణ భారతదేశంలోనీ తెలంగాణకు ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చామని,జిల్లాల వారిగా పరిశీలకులు నాయకుల అభిప్రాయాలు తీసుకుంటున్నమని,ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమయ్యే నాయకులకు అవకాశం దక్కుతుందని,రాబోయే రోజుల్లో జిల్లా అధ్యక్షులకే కాదు మండల నాయకులను కూడా ఇదే విధంగా ఎన్నుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.











