హుజురాబాద్/ నవంబర్ 29(మా అక్షరం): అఖిల భారత పద్మశాలి పురోహిత సంఘం ఆధ్వర్యంలో శనివారం హుజురాబాద్ చేనేత సహకార సంఘం కార్యాలయంలో శ్రీ మార్కండేయ స్వామి మాలధారణ దీక్ష ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంఘం మార్గదర్శకులు, పద్మ కులరత్న చిలుక నరసప్ప పద్మశాలి గురుస్వామి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ… 10-12-2025 నుంచి ప్రారంభమయ్యే మార్కండేయ స్వామి మాలధారణ దీక్ష 21-01-2026 న స్వామి జన్మదినం సందర్భంగా జరగబోయే రథయాత్రతో ముగుస్తుందని తెలిపారు. స్త్రీ–పురుషులు, వయస్సుతో సంబంధం లేకుండా భక్తులు ఈ దీక్షలో పాల్గొనవచ్చునని అన్నారు.కార్యక్రమంలో హుజురాబాద్ చేనేత సంఘం అధ్యక్షుడు ఎలిగేటి ఉపేందర్, ఉపాధ్యక్షుడు వేముల యాదగిరి, సబ్బని రాజేందర్, చిలుకమారి శ్రీనివాస్, కుడికాల సాయి, ఇప్పలపెల్లి చంద్రశేఖర్, ఇప్పలపెల్లి నరేష్ ,ఇప్పకాయల సాగర్, ముషం వెంకన్న, మ్యాకం రాజగోపాల్, అక్కెన సమ్మయ్య, రాజు ,సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











