+91 99635 77856

హుజురాబాద్‌లో ఘనంగా పడిపూజ కార్యక్రమం

-హుజురాబాద్‌లో ఘనంగా పడిపూజ కార్యక్రమం…
-కాళ్ళ సంతోష్ ఆధ్వర్యంలో మహా దివ్య భిక్ష…

హుజురాబాద్‌/నవంబర్ 30 (మా అక్షరం):
మండలంలోని పరకాల క్రాస్‌ రోడ్డులో గల వాసవి ఇండస్ట్రీస్‌ (ఎం.ఆర్.ఎం) ప్రాంగణంలో ఆదివారం మహా దివ్య పడిపూజ (భిక్ష) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రైస్‌ మిల్లు వ్యాపారులు కాళ్ళ బసవన్న, కాళ్ళ సంతోష్, అనిమ దంపతులు స్వంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.కల్లూరు వెంకట్రావు, ధోరై రాజు గురు స్వాముల ఆధ్వర్యంలో సాగిన ఈ పూజల్లో పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల ధరించిన సుమారు 500 మంది స్వాములు పాల్గొన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, మహిళలు పాల్గొని భక్తిశ్రద్ధలతో స్వామివారిని ఆరాధించారు. హుజురాబాద్ శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో భజన–కీర్తనలు నిర్వహించగా భక్తి వాతావరణం నెలకొంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !