హుజురాబాద్ /జనవరి 05(మా అక్షరం): ప్రజలకు అందించిన సేవలను గుర్తించి పోలీసు శాఖ, రాష్ట్రస్థాయి ఉత్తమ సేవా అవార్డును పట్టణ సిఐ టి. కరుణాకర్ కు ప్రదానం చేసింది. ఈ సందర్భంగా పట్టణ బీసీ జేఏసీ అధ్యక్షుడు సందేల వెంకన్న ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ గౌరవాధ్యక్షుడు చందుపట్ల జనార్ధన్ మాట్లాడుతూ… బీసీ వర్గానికి చెందిన అధికారి రాష్ట్రస్థాయి అవార్డు సాధించడం హుజురాబాద్కు గౌరవకారణమని అన్నారు. సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు న్యాయం చేయడంలో మరింత కృషి చేసి, జాతీయస్థాయిలో కూడా గుర్తింపు దక్కించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
హనుమాన్ దేవాలయం చైర్మన్ కొలిపాక శంకర్, ఏఎంసీ డైరెక్టర్ బండారి సదానందం, మాజీ సర్పంచులు బింగి కర్ణాకర్, పంజాల రామ్, శంకర్ గౌడ్, తాళ్లపల్లి రమేష్, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, పూలే కమిటీ అధ్యక్షుడు ఇప్పలపల్లి చంద్రశేఖర్, జేఏసీ ప్రధాన కార్యదర్శి ఇప్పకాయల సాగర్, ఆకుల సదానందం, భారత ప్రభాకర్, చీకట్ల సమ్మయ్య, మార్త రవీందర్, ఎర్రబొజ్జ నారాయణ, తాటిపాముల కనకయ్య, ప్రతాప్, సందీప్, మాడుగుల ఓదేలు, రామ్ సారయ్య, దొంత హరికిషన్, మామునూరి ప్రవీణ్ కుమార్, బొంగోని వెంకటయ్య, గాజర్ల బుచ్చిరాజం, పెద్దపేట రమేష్, జెకె ప్రభాకర్, గోస్కుల మధుకర్, గరవేణ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.











