హుజురాబాద్/ జనవరి 05 (మా అక్షరం):తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు హుజురాబాద్ పురపాలక సంఘ పరిధిలోని 30 వార్డుల ముసాయిదా ఓటర్ల జాబితా, చేర్పులు–మార్పులపై మున్సిపల్ కమిషనర్ కె. సమ్మయ్య ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి జాబితాను పరిశీలించారు.ముసాయిదాలో ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే సమయానుకూలంగా సమర్పించాలని కమిషనర్ సూచించారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ఎన్. అశ్విని గాంధీతో పాటు పలువురు రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు.
Post Views: 169











