హుజురాబాద్ / జనవరి 12 (మా అక్షరం):పురపాలక సంఘం – నగరపాలక సంస్థల రెండో సాధారణ ఎన్నికలు–2026లో భాగంగా, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హుజురాబాద్ పురపాలక సంఘం పరిధిలోని మొత్తం 30 ఎన్నికల వార్డులకు సంబంధించిన తుది ఫొటో ఓటర్ల జాబితాను సోమవారం విడుదల చేసినట్లు కమిషనర్ కెంసారపు. సమ్మయ్య తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో కమిషనర్తో పాటు కార్యాలయ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి ,సిబ్బంది పాల్గొన్నారు. తుది ఓటర్ల జాబితా విడుదలతో ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో సరిగా ఉన్నాయో లేదో పరిశీలించుకొని, అవసరమైన వివరాల కోసం మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు.
Post Views: 213











