-హుజురాబాద్ మునిసిపాలిటీలో 100% ఆస్తి పన్ను వసూళ్లు…
-వార్డు అధికారులకు సన్మానం…
హుజురాబాద్/ ఫిబ్రవరి 21(మా అక్షరం): మునిసిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లలో మూడు వార్డులు 100 శాతం లక్ష్యాన్ని సాధించాయి. నిర్ణయించిన గడువులో పూర్తి స్థాయిలో పన్ను వసూలు చేయడంతో సంబంధిత వార్డులు ప్రత్యేక గుర్తింపు పొందాయి.ఈ సందర్భంగా 100 శాతం వసూళ్లు పూర్తి చేసిన వార్డు అధికారులు ఖలీల్ మహమ్మద్, ఏల్పుల బాపు, బండ మోహన్లను మునిసిపల్ అధికారులు సన్మానించారు. వారి కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, మేనేజర్ రావుల భూపాల్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇల్లందుల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 676











