+91 99635 77856

ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

-ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు…
-ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ పూలమాలలతో నివాళి…
హుజురాబాద్/ఫిబ్రవరి19(మా అక్షరం): పట్టణంలోని శివాజీ కాలనీలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, మొఘల్ సామ్రాజ్యాన్ని ధైర్యంగా ఎదిరించిన మహానేత శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు వన్నాల శివాజీ శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. యువత శివాజీ మహారాజ్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని దేశభక్తి, ధైర్యసాహసాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ జయంతోత్సవ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షులు సంధ్యల వెంకన్న, రంగాపూర్ వార్డ్ మెంబర్ గుడ్ల బాబ్జి, గుడ్ల శ్యామలరావు, గుండారపు చంద్రశేఖర్, వన్నాల నేతాజీ, వన్నాల భీష్మాజీ తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !