+91 99635 77856

డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష రేపటి నుంచి అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష

హుజురాబాద్/ ఏప్రిల్ 06( మా అక్షరం): పట్టణంలో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.రేపు (ఏప్రిల్ 7) ఉదయం 10 గంటల నుంచి ఏప్రిల్ 8 ఉదయం 10 గంటల వరకు అంబేద్కర్ చౌరస్తాలో ఈ దీక్ష కొనసాగనుంది. హుజురాబాద్ నియోజకవర్గంలోని 108 గ్రామ పంచాయతీల ప్రజలు, పార్టీలకు అతీతంగా మహిళలు, యువకులు, రైతులు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నిరసనకు మద్దతు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.డంపింగ్ యార్డ్ ఏర్పాటు జరిగితే ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం తీవ్రంగా దెబ్బతింటాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సమస్యను ప్రజలు గంభీరంగా తీసుకుని ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.హుజురాబాద్ భవిష్యత్తును కాపాడుకోవాలంటే ప్రజలంతా ఒక్కటిగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !