హుజూరాబాద్/ఏప్రిల్ 08( మా అక్షరం): ఇటీవల ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ రొంటాల సుహాసిని ని హుజూరాబాద్ ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ఎలక్ట్రిసిటీ విభాగం తరఫున ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు చైర్మన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె నాయకత్వంలో మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అలాగే ఎలక్ట్రిసిటీ విభాగానికి సంబంధించిన సమస్యల పరిష్కారంలో సహకారం అందించాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న ADE శ్రీనివాస్ గారు కోరారు.చైర్మన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ, తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి మరియు అభివృద్ధి కార్యక్రమాలకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షుడు సొల్లు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్ పుల్లూరి, సీనియర్ నాయకులు తలగంప రాములు, తాళ్ల యాదగిరి, తప్పెట లక్ష్మణ్, అసోసియేషన్ సభ్యులు, ఎలక్ట్రిసిటీ విభాగ సిబ్బంది పాల్గొన్నారు.













