+91 99635 77856

కిట్స్ అధ్యాపకురాలు గౌరీ దేశ్‌పాండేకు డాక్టరేట్

-కిట్స్ అధ్యాపకురాలు గౌరీ దేశ్‌పాండేకు డాక్టరేట్…

హుజురాబాద్/ ఏప్రిల్ 26 (మా అక్షరం): మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ECE) విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గౌరీ దేశ్‌పాండే డాక్టరేట్ పట్టా పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కందుకూరి శంకర్ తెలిపారు.ఎస్సార్ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సందీప్ భట్టాచార్య, డాక్టర్ అజయన్ సంయుక్త మార్గదర్శకత్వంలో “నానో స్కేల్ GaN MOSHEMT పరికరాల్లో DCRF పనితీరును మెరుగుపరచడం – తదుపరి తరం RF ఆంప్లిఫైయర్ల కోసం అధ్యయనం” అనే అంశంపై ఆమె పరిశోధన చేశారు.ఈ పరిశోధన పత్రాలను ఎస్సార్ విశ్వవిద్యాలయానికి సమర్పించగా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా గౌరీ దేశ్‌పాండేను కళాశాల చైర్మన్ మాజీ ఎంపీ కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు,సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే వి.సతీష్ కుమార్, కోశాధికారి వి.ఇంద్రనీల్, విభాగాధిపతి డాక్టర్ బి.రమేష్, డీన్ డాక్టర్ యోగేష్ పుండలిక్, రిజిస్ట్రార్ డాక్టర్ రాజేశ్వరరావు,అధ్యాపకులు అభినందించారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !