జమ్మికుంట /ఆగస్టు 25(మా అక్షరం): మండల పరిధిలోని వావిలాల పిహెచ్సి నీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రి చుట్టూ తిరుగుతూ పేదలకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు.ఆసుపత్రి నిర్వహణపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నామని,పేదలకు అందించే వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.దీనిపై జిల్లా కలెక్టర్,సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వావిలాల సర్పంచ్ అర్జున్,మండల అధ్యక్షుడు పరశురామారావు,పొనగంటి మల్లయ్య,సారంగపాణి,సజ్జు జమ్మికుంట,వావిలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 42












