-సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు పూయడం దారుణం…
-హుజురాబాద్లో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…
హుజురాబాద్/ సెప్టెంబర్ 3 (మా అక్షరం): తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణుల దాడిని, సంత్ రవిదాస్ చిత్రపటంపై నల్లరంగు పూయడాన్ని నిరసిస్తూ హుజురాబాద్లో బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు.అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టిన నిరసనలో సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. రాజకీయ భేదాభిప్రాయాలను ప్రజాస్వామ్య పద్ధతుల్లో వ్యక్తం చేయాలే తప్ప రాజకీయ ప్రత్యర్థుల కార్యాలయాలపై దాడులకు పాల్పడటం సరికాదన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.మహనీయుల చిత్రపటాలపై నల్లరంగు పూయడం కోట్లాది ప్రజల మనోభావాలను అవమానించడమేనని అన్నారు.సంత్ రవిదాస్ చిత్రపటాన్ని అవమానించిన వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నామనే అహంకారంతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తూర్పాటి రాజు,జిల్లా కౌన్సిల్ మెంబర్ రావుల వేణు,సెంట్రల్ ఫిల్మ్ బోర్డు మెంబర్ సబ్బని రమేష్,పట్టణ ప్రధాన కార్యదర్శులు తిప్పబత్తిని రాజు,గంట సంపత్, సీనియర్ నాయకులు కొలిపాక శ్రీనివాస్,నల్ల సుమన్,నరాల రాజశేఖర్,యాంసాని శశిధర్, యళ్ల సంజీవరెడ్డి,ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఎర్ర శ్రీధర్,ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కుతాడి కుమార్స్వామి,పట్టణ ఉపాధ్యక్షులు ఇల్లందుల ప్రణీత్, వడ్నాల విజయ్,ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొలిపాక వెంకటేష్,బీజేవైఎం అధ్యక్షుడు మోటపోతుల రాకేష్,కిసాన్ మోర్చా అధ్యక్షుడు మాసాడి శ్రీనివాసరావు, పట్టణ కార్యదర్శులు కొడిమ్యాల పవన్, గుర్రం సంతోష్, బోడిగె రాధ, కొలుగూరి అనిల్, పట్టణ కోశాధికారి క్యాస వెంకటేష్, బూత్ అధ్యక్షులు యాట రాజేష్, అపరాధ రమణ, భోరగల సారయ్య, పడారి కొమరయ్య, డోరీ ఐలయ్య, తూర్పాటి శంకర్,తూర్పాటి రామ్చంద్రం, ములుగురి రాజు,దాసరి వీరన్న,మొలుగూరి నగేష్తో పాటు ఎస్సీ మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.












