-టీయూడబ్ల్యూజేఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు యోహన్..
కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్:
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టి యు డబ్ల్యూ జె ఎఫ్ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు చౌడమల్ల యోహన్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మా అక్షరం దినపత్రికతో మాట్లాడుతూ… విలేకరులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రతి జర్నలిస్టుకు నివేషణ స్థలాలు కల్పించాలన్నారు.గత ప్రభుత్వం హయాంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించి,వారి ఉన్నతికి తోడ్పడాలని ఆయన కోరారు.
Post Views: 108












