-వార్డెన్లు స్థానికంగా ఉంటూ పరీక్షలకు సన్నద్ధం చేయాలి
-ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి, కేషబోయిన రాము యాదవ్
కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్: హుజురాబాద్,జమ్మికుంట వ్యాప్తంగా ఉన్న సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని,హాస్టల్ వార్డెన్ లు స్థానికంగా ఉంటూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా చూడాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కేషబోయిన రాము యాదవ్ అన్నారు. శనివారం నియోజకవర్గం లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేషబోయిన రాము యాదవ్ మాట్లాడుతూ.. ఈ నెల, మార్చి నుండి ఇంటర్మీడియట్,10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతి గృహాల వార్డెన్లు స్థానికంగా హాస్టల్ లో టైం టేబుల్ ప్రకారం ఉంటూ ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, విద్యార్థులకు సమయానికి మెనూ,ప్రకారం భోజనం అందించి, మానసిక శారీరక ఒత్తిళ్లకు గురి చేయకుండా పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఆయన కోరారు. వార్డెన్లు సక్రమంగా విధులు నిర్వహించకుంటే ఉరుకోబోమని, ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నామని ఆయన హెచ్చరించారు. వార్డెన్లు గతంలో ఏమైనా తప్పిదాలు చేస్తే తీరు మార్చుకోవాలని, విద్యార్థుల భవిష్యత్ అభివృద్ధి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.












