+91 99635 77856

జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలి

– కాంగ్రెస్ పార్టీ నియజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్
కరీంనగర్ జిల్లా/ హుజూరాబాద్ :సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అధికారులను, జాతర కమిటీ చైర్మన్, డైరెక్టర్లను ఆదేశించారు.

శనివారం పట్టణంలోని రంగనాయకుల గుట్ట సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం మంచినీటి ఏర్పాట్లతోపాటు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని సూచించారు.భక్తుల కోసం చలువ పందిళ్ళు ఏర్పాటు చేయాలన్నారు.రోడ్లకు ఇరువైపులా పెరిగిన చెట్లను తొలగించాలని తెలిపారు.ఈ సందర్భంగా జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి,వైస్ చైర్మన్ గాలిబు నరేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు సొల్లు బాబు, కొల్లూరి కిరణ్, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షులు ఎండి అఫ్సర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లూరి రాహుల్, హనుమాన్ దేవాలయ కమిటీ చైర్మన్ కొలిపాక శంకర్, తాళ్ళపల్లి రమేష్, కుడికాల శ్రీనివాస్, మిడిదొడ్డి రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సొల్లు దశరథం, కిరణ్ రెడ్డి, మిడిదొడ్డి శ్రీనివాస్, శ్రావణ్, సమ్మక్క సారక్క జాతర కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !