+91 99635 77856

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసాం…

– సమ్మక్క- సారక్క జాతర కమిటి ఛైర్మన్ మూగల రాజిరెడ్డి
కరీంనగర్ జిల్లా/హుజూరాబాద్ :భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేసామని హుజురాబాద్ సమ్మక్క-సారలమ్మ జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక రంగనాయకుల గుట్ట సమీపంలోని సమ్మక్క-సారలమ్మ దేవాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… భక్తుల సౌకర్యార్థం మంచినీటి ఏర్పాటుతోపాటు విద్యుత్ దీపాలను,స్నాన ఘట్టాలను, పోలీసులు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటారని ఆయన తెలిపారు. ఇప్పటికే సారలమ్మ తల్లి గద్దేకు రావడం జరిగిందని, ఈ సాయంత్రం పెద్ద పాపయ్య పల్లి నుండి సమ్మక్క తల్లి గద్దెకు రావడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ గాలీబ్ నరేష్, డైరెక్టర్లు చురుకంటి తిరుపతిరెడ్డి, సొల్లు హైమావతి, వలుగు తిరుపతి, కొలిపాక రమేష్,గడ్డం రాఘవేందర్, మిడిదొడ్డి రాజు, సుంకరి రాజేందర్, ఎర్ర నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, విష్ణు,సురేష్, సుదర్శన్,సంపత్, ప్రణయ్,అచ్చుత్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !