+91 99635 77856

కొలువు దీరిన సమ్మక్క-సారలమ్మలు..

కరీంనగర్ జిల్లా/హుజరాబాద్: తెలంగాణ కుంభమేళగా పిలిపించుకునే సమ్మక్క- సారలమ్మ జాతర ప్రధాన ఘట్టం ముగిసింది.

సమ్మక్క రాకతో ప్రధాన జాతర ప్రారంభమైంది. పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట సమీపంలోని ప్రతి ఏట సమ్మక్క- సారలమ్మల జాతర వైభవంగా జరుగుతుంది.ఈ ఏడాది కూడా ఈ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమ్మక్కను మండలంలోని పెద్ద పాపయ్యపల్లి గ్రామం నుంచి కొయ్య పూజారులు డప్పు చప్పుల మధ్య తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించారు.అనంతరం పూజారులు పూజలు నిర్వహించారు.అనంతరం భక్తులు అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి,వైస్ చైర్మన్ గాలీబ్ నరేష్,డైరెక్టర్లు చురుకంటి తిరుపతిరెడ్డి,సొల్లు హైమావతి,వలుగు తిరుపతి,కొలిపాక రమేష్,గడ్డం రాఘవేందర్,సుంకరి రాజేందర్, ఎర్ర నాగరాజు,శ్రీనివాస్ గౌడ్, విష్ణు,సురేష్,రాజు,సుదర్శన్,సంపత్, ప్రణయ్,అచ్చుత్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

జూపాకలో..
మండలంలోని జూపాక గ్రామంలో సమ్మక్క- సారలమ్మ జాతరలో సమ్మక్క ఆగమనంతో జాతర ప్రారంభమైంది. సమ్మక్కను కొయ్య పూజారులు భక్తి శ్రద్ధల మధ్య తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ దాసరి సదయ్య, డైరెక్టర్లు గంటరాజు జెల్లీ బలరాం రెడ్డి, రత్నాకర్ రెడ్డి, పంజాల తిరుపతి, తాళ్ల పెళ్లి అరవింద్, మార్కా సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !