కరీంనగర్ జిల్లా/ హుజరాబాద్:న్యూస్ లైన్ ఛానెల్ ఎడిటర్ జర్నలిస్ట్ శంకర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టి డబ్ల్యూ జె ఎఫ్.జాతీయ కౌన్సిల్ సభ్యులు కుడుతాడి బాపురావు ఒక ప్రకటనలో శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ప్రజా సమస్యలను లెవనెత్తి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండే ఓ జర్నలిస్టుపై అర్ధరాత్రి 15 మందికిపైగా గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత పాశవికంగా దాడి చేయటం అమానుషం అన్నారు. భౌతిక దాడులను డబ్ల్యూ జె ఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదు చేసి తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వ్వాన్ని, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
Post Views: 105













