కరీంనగర్ జిల్లా/ హుజురాబాద్:తెలంగాణ కుంభమేళగా పిలిపించుకునే సమ్మక్క- సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. శుక్రవారం పట్టణ శివారులోని రంగనాయకుల గుట్ట వద్ద గల సమ్మక్క సాలమ్మ వన దేవతలిద్దరూ గద్దెల పైకి రావడంతో భక్తులు మొక్కిన మొక్కులు అప్పజెప్పడానికి భక్తుల తాకిడి పెరిగింది.తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ, మున్సిపల్, వైద్య ఆరోగ్యశాఖ, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. జాతర కమిటీ చైర్మన్ మూగల రాజిరెడ్డి డైరెక్టర్లతో కలిసి వాలంటీర్ల సహాయంతో సేవలందించారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్న ప్రణాళిక బోర్డు సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ.బొల్లం రమేష్ ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు.











