+91 99635 77856

ఖబర్దార్… బండి సంజయ్…

– కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు యేముల పుష్పలత
కరీంనగర్ జిల్లా/హుజురాబాద్: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు వేముల పుష్పలత హెచ్చరించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎంపీ బండి సంజయ్ పై ఫిర్యాదు చేసిన సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాత్ర కీలకమైందని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటం చేసిన వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన తల్లి పై ఆరోపణ చేస్తే ఊరుకోమని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలోమండల అధ్యక్షురాలు లంకదాసరి లావణ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఆలేటి సుశీల, సొల్లు సునిత, మల్లీశ్వరి, కడారి తిరుమల, లక్ష్మి, రాధ, కరీమా, మంజులతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొల్లూరి కిరణ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సొల్లు బాబు, యస్సి సెల్ పట్టణ అధ్యక్షులు ఎర్ర రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

error: Content is protected !!

 Don't Miss this News !