కరీంనగర్ జిల్లా/హుజురాబాద్:మండలం లోని జూపాక గ్రామానికి చెందిన పంజాల రిచిత(20) శుక్రవారం అర్ధరాత్రి ఊపిరితిత్తుల వ్యాధి తో చికిత్స పొందుతూ మృతి చెందింది.గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పంజాల రాజు కుమార్తె కవిత జార్జియా దేశంలో వైద్య విద్యలో ద్వితీయ సంవత్సరం చదువుతుండగా కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతుండగా అక్కడి తోటి విద్యార్థులు చికిత్స కోసం హాస్పిటల్ చేర్పించినారు. విద్యాభ్యాసం హుజరాబాద్ లో మొదటి నుండి ఆరో తరగతి వరకు విజ్ఞాన్ ప్రైవేట్ స్కూల్లో ఏడు నుండి పదో తరగతి వరకు జమ్మికుంటలోని ప్రైవేట్ కాకతీయ హైస్కూల్లో ఇంటర్ మీడియట్ కోరుట్ల మాస్టర్ కాలేజీలో చదివింది.తండ్రి జగిత్యాల జిల్లాలో విద్యుత్ శాఖలో ఈ ఆర్ వో ఆఫీస్ లో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు.ఆమె మృతి పట్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Post Views: 60











